- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాలపై సుప్రీంకోర్టు స్పందించింది. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటికే వెలువడిన ట్రిబ్యునల్ ఉత్తర్వులు, ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను సోమవారం విచారించిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వంతో సహా నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదాలకు సంబంధించిన వివరాలతో పాటు రాష్ట్రాల అభిప్రాయాలను మూడు పేజీలకు మించకుండా సుప్రీంకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేశారు. డిసెంబరు 13వ తేదీ నుంచి వరుసగా విచారణ జరుగుతుందని, అప్పటికల్లా ఇవి అందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం సైతం కృష్ణా జలాల వ్యవహారంలో ట్రిబ్యునల్ ఉత్తర్వులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ వెలువరించిన గెజిట్కు సంబంధించిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. డిసెంబరు 13న విచారణ ప్రారంభం కానున్నందున దానికి 48 గంటల ముందే కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ అందాలని నొక్కిచెప్పారు.