విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ వాయిదా

by  |
విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ వాయిదా
X

దిశ, వెబ్‎డెస్క్ :
విశాఖ గ్యాస్ లీకేజీ గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ పిటిషన్‌పై జస్టిస్ లలిత్ ధర్మాసనం విచారించింది. ఎన్జీటీ సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్జీటీలో కేసు విచారణ నవంబర్ 3న ఉందని కోర్టుకు న్యాయవాది ముకుల్ రోహత్గి విన్నవించారు. ఎన్జీటీలో కమిటీ నివేదికపై 10 రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలని ఎల్జీ పాలిమర్స్‌కు సుప్రీం ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్జీటీలో కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ నవంబర్ 16కి ధర్మాసనం వాయిదా వేసింది.



Next Story

Most Viewed