ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం

by  |
ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాధాస్వామి (50) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

సమాచారం అందుకున్న 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని, వాహనంలో కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని ఈఎంటి జయప్రసాద్, ఫైలట్ వెంకటేశులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు చేపట్టే విచారణలో తేలాల్సి ఉంది.


Next Story