ఎవరి మాట వినొద్దు.. ఉక్కుపాదం మోపండి: మంత్రి వేముల

by  |
ఎవరి మాట వినొద్దు.. ఉక్కుపాదం మోపండి: మంత్రి వేముల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్న అక్రమార్కులను ఉపేక్షించేది లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల వ్యాపారులను ఉక్కు పాదంతో శిక్షించాలని, ఎవరి సిఫార్సులు వినాల్సిన అవసరం లేదని అధికారులకు ఆర్డర్స్ పాస్ చేశారు. వానకాలం పంటల కోసం జిల్లాలో అధికారులు ఎరువులు, విత్తనాల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి వేముల ప్రశాంత్ సూచించారు.

Next Story

Most Viewed