కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

by  |
కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి:  మంత్రి శ్రీనివాస్ గౌడ్ 
X

దిశ, మహబూబ్‎నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‎డౌన్ నిబంధనలను కొంత మేర‌కు సడలించినప్పటికీ జిల్లావాసులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ ఇతర అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో జిల్లా అధికారులు కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. నెల రోజుల నుంచి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం లాక్‎డౌన్ నిబంధనలను సడలించినందున ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అనేక మంది వలస కూలీలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు.

Tags: Srinivas Goud, Telly conference, Chieftains, Corona Prevention

Next Story

Most Viewed