కరోనా నివారణకు స్ప్రే

by  |
కరోనా నివారణకు స్ప్రే
X

దిశ, న్యూస్‎బ్యూరో: జీహెచ్‎ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ప్రధాన రహదారుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేస్తుంది. ఇందులో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఈ.వీ.డీ.యం డైరెక్టర్ విశ్వజీత్ కంపాటి సికింద్రాబాద్, ఎల్బీ నగర్ జోన్‎లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్‎లోని తార్నాక, మౌలాలి నేరెడ్‎మెట్, యాప్రాల్, సైనిక్‎పురి, హౌసింగ్‎బోర్డ్ కాలనీలలో పర్యటించి పారిశుధ్య పనులు, హైప్రెజర్ జెట్టింగ్ మిషన్‎లతో సోడియం హైపోక్లోరైట్ పిచికారిని పరిశీలించారు. మార్కెట్లు, దుకాణాల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులను కొనేటప్పుడు ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. అధికారులు, కార్పొరేటర్లు ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడాలని వారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ శైలజ, కార్పొరేటర్లు అలకుంట్ల సరస్వతి, గోళ్ళూరి అంజయ్య, శ్రీదేవి, స్వర్ణరాజ్ పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed