- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rohit Sharma : కెప్టెన్గా కొనసాగుతా.. సెలెక్టర్లకు తేల్చిచెప్పిన రోహిత్ శర్మ

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు కెప్టెన్గా తాను కొనసాగుతా అని రోహిత్ శర్మ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ నిర్వహించిన రివ్యూ మీటింగ్లో రోహిత్ తన అభిప్రాయాన్ని తెలిపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. బీసీసీఐ ఉన్నతాధికారులు, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముంబైలో శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ఎనిమిది టెస్ట్ల్లో భారత్ ఆరింట ఓడిపోవడంపై ప్రధానంగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు టెస్ట్, వన్డేలకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరిస్తా అని చెప్పినట్లు సమాచారం. తన తర్వాత భారత జట్టును నడిపించే సారధిని ఎన్నుకునే వరకు తానే నాయకత్వం వహిస్తా అని రోహిత్ అన్నట్లు తెలిసింది. ఎవరిని ఎంపిక చేసినా.. పూర్తిగా సహకరిస్తా అని రోహిత్ చెప్పినట్లు తెలుస్తోంది. వన్డేలకు సైతం రోహిత్ కెప్టెన్గా వ్యవహరించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను బీసీసీఐ టీ20 కెప్టెన్గా నియమించింది.
బుమ్రాకే సారథ్య బాధ్యతలు?
భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్గా సమర్థుడైన బుమ్రాను నియమించాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్ట్లో బుమ్రా జట్టుకు విజయాన్ని అందించాడు అయితే చివరి టెస్ట్లో బుమ్రా సారథ్యం వహించిన మ్యాచ్లో మాత్రం భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచ్లో వెన్నునొప్పి కారణంగా బుమ్రా బౌలింగ్ చేయలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్లో 150 ఓవర్లు వేసిన బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటంపై కూడా అనుమానాలు ఉన్నాయి. వర్క్ లోడ్ కారణంగా బుమ్రా బౌలింగ్పై ఎఫెక్ట్ పడుతుందనే భావనతో ఈ విషయంలో బీసీసీఐ పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్నే కెప్టెన్గా భవిష్యత్తులో బుమ్రాకు సారథ్య బాధ్యతలపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.