కోహ్లీ వచ్చేశాడు.. ఆర్సీబీ క్యాంప్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్

by Dishanational3 |
కోహ్లీ వచ్చేశాడు.. ఆర్సీబీ క్యాంప్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్
X

దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోమవారం ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. ఇటీవల విరాట్ భార్య అనుష్క శర్మ రెండో సంతానంలో మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లీ.. భార్య ప్రసవం కోసం ఇంగ్లాండ్‌‌కు వెళ్లాడు. ఆదివారమే స్వదేశానికి చేరుకున్న అతను సోమవారం ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కోహ్లీకి సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ కోసం బెంగళూరుకు తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. ‘రెండు నెలల తర్వాత తిరిగి క్రికెట్ ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే, ఐపీఎల్ కోసం ఉత్సాహంగా ఉన్నా. అభిమానులందరూ సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నా.’ అని చెప్పాడు. ఈ నెల 22న ఓపెనింగ్ మ్యాచ్‌లో చెన్నయ్‌తో బెంగళూరు తలపడనుంది.


Next Story

Most Viewed