INDvsENG: టీమిండియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |

లీడ్స్ మైదానం(Leeds Ground) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది.

INDvsENG: టీమిండియా ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: లీడ్స్ మైదానం(Leeds Ground) వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరుగుతోన్న తొలి టెస్టు రెండో సెకండ్ ఇన్సింగ్స్‌లో టీమిండియా(Team India) ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 96 ఓవర్లు ఆడిన భారత్.. 10 వికెట్లు కోల్పోయి.. 364 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఎదుట 371 పరుగుల టార్గెట్ పెట్టింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (137), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (118), సాయి సుదర్శన్ (30), రవీంద్ర జడేజా (25), కరుణ్ నాయర్ (20) పరుగులతో రాణించారు. యశస్వి జైస్వాల్ (04), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(08) విఫలం అయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడెన్, జోష్ టంగ్ చెరో మూడేసి వికెట్లు తీయగా, షోయబ్ బషీర్ రెండు వికెట్లు, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీశారు.

Next Story