Spain Masters 2024: సింధు శుభారంభం

by Dishanational3 |
PV Sindhu enters into quarter finals in Malaysia Masters 2022
X

దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్‌లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21-16, 21-12 తేడాతో వెన్ యు జాంగ్(కెనడా)పై విజయం సాధించింది. యువ క్రీడాకారిణి అష్మిత 13-21, 11-21 తేడాతో ఇంటనాన్(థాయిలాండ్) చేతిలో ఓడిపోయి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. మరోవైపు, మెన్స్ డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల జంట రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో భారత జోడీ 21-18, 21-17 తేడాతో జాబ్ కాస్టిల్లో-లూయిస్ మోంటోయా(మెక్సికో) జంటను చిత్తు చేసింది. అలాగే, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కిరెడ్డి 16-21, 22-20, 21-14 తేడాతో చైనీస్ తైపీకి చెందిన చెన్ జి రాయ్-యాంగ్ చింగ్ టున్‌ జంటను ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

Next Story

Most Viewed