- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)
సాయి సుదర్శన్కు గుడ్ న్యూస్.. రోహిత్ స్థానంలో ఇంగ్లాండ్ టూరుకు?

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ టూరుకు ముందు అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. దీంతో కొత్త టెస్టు సారథిని ఎంపిక చేసే పనిలో పడింది బీసీసీఐ. అలాగే, టెస్టుల్లో ఓపెనర్గా రోహిత్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే చర్చ కూడా జరుగుతుంది. ఓపెనర్ రేసులో యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది.
సుదర్శన్ ఇంకా టెస్టు అరంగేట్రం చేయలేదు. అయితే, 2023లోనే భారత జట్టులోకి వచ్చాడు. మూడు వన్డేలు ఆడిన అతను రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. గతేడాది బీసీసీఐ అతన్ని భారత ఏ జట్టుకు ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా ఏ జట్టుపై సెంచరీతో రాణించాడు. అయితే, ఓపెనర్ స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో అతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇప్పుడు రోహిత్ రిటైర్ అవడంతో హిట్ మ్యాన్ స్థానంలో సుదర్శన్ను ఓపెనర్గా దించాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ఐపీఎల్లో సుదర్శన్ భీకర ఫామ్లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున 11 మ్యాచ్ల్లో 509 రన్స్ చేశాడు. అందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టాప్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో అతను ఆరెంజ్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు. అలాగే, దేశవాళీలోనూ అతని ప్రదర్శన బాగానే ఉంది. 49 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 1,57 రన్స్ చేశాడు. దానికితోడు ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం కూడా అతని సొంతం. కెంట్ జట్టు తరపున కౌంటీ చాంపియన్షిప్ ఆడాడు. అయితే, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ కూడా గతంలో ఓపెనర్లుగా దిగారు. వారికి కూడా అవకాశం ఇచ్చే చాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఓపెనర్గా అవకాశం దక్కకపోయినా సుదర్శన్కు జట్టులో చోటు మాత్రం ఖాయంగానే కనిపిస్తున్నది. టీమ్ మేనేజ్మెంట్ అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపించొచ్చు.