పాకిస్థాన్ మహిళల జట్టుకు ఐసీసీ షాక్..!

by velandi.Saikiran |   (  Updated:2026-06-16 14:24:52  IST  )

పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుపై భారీ ఫైన్ వేసింది ఐసీసీ.

పాకిస్థాన్ మహిళల జట్టుకు ఐసీసీ షాక్..!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉమెన్స్ మహిళల ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్ లో భారత జట్టు దెబ్బకు చిత్తుగా ఓడింది పాకిస్తాన్. భారత్ చేతిలో ఏకంగా 64 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాక్ పై తాజాగా ఐసీసీ భారీ ఫైన్ వేసింది. ఇండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదు అయినట్లు గుర్తించింది ఐసీసీ. ఈ క్రమంలో పాకిస్తాన్ మహిళల జట్టుపై మ్యాచ్ ఫీజులో ఐదు శాతం ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 17 ఓవర్లు ఆడి 106 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో ఇండియా విక్టరీ కొట్టింది.

Next Story