వృందావన్‌ సందర్శించిన కోహ్లీ, అనుష్క

by Phanindra |

టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ.. భార్యతో కలిసి యూపీలోని ప్రేమానంద్ మహరాజ్‌ను దర్శించుకున్నాడు.

వృందావన్‌ సందర్శించిన కోహ్లీ, అనుష్క
X

దిశ, స్పోర్ట్స్: టెస్టులకు వీడ్కోలు పలికిన కింగ్ కోహ్లీ.. భార్య అనుష్కతో కలిసి యూపీలోని వృందావన్ సందర్శించాడు. 13 ఏళ్ల సుదీర్ఘ టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇటీవలే ఇన్‌స్టాగ్రాం వేదికగా ప్రకటించిన కోహ్లీ.. ఇక్కడి ప్రేమానంద్ మహరాజ్ ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ‘సంతోషంగానే ఉన్నావా?’ అని స్వామీజీ అడిగితే కోహ్లీ నవ్వుతూ అవునన్నాడు. ఇటీవలి కాలంలో జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో కోహ్లీ దంపతులు ఇలా ఆధ్మాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్శనం అనంతరం మంగళవారం నాడే కోహ్లీ, అనుష్క దంపతులు తిరిగి ముంబై వెళ్లిపోయారు.

Next Story