డబ్ల్యూటీసీకి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ

by Disha Web Desk 12 |
డబ్ల్యూటీసీకి ముందు భారత్‌కు ఎదురుదెబ్బ
X

అహ్మదాబాద్: టీమ్ ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇషాన్.. 16వ ఓవర్ ముగిసిన తర్వాత కీపింగ్ చేసేందుకు మరో ఎండ్‌కు వెళుతున్న సమయంలో అదే జట్టుకు చెందిన బౌలర్ జోర్డాన్‌ను అనుకోకుండా ఢీకొట్టాడు. జోర్డాన్ మోచేయి ఇషాన్ కంటికి తగలడంతో అతను నొప్పితో విలవిలలాడడు.

దీంతో కీపింగ్ చేయలేక మైదానాన్ని విడిచి వెళ్లారు. అతని స్థానంలో వినోద్ కీపింగ్ చేయగా, బ్యాటింగ్‌కు సైతం ఇషాన్ రాలేకపోయాడు. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఇషాన్ గాయపడటం టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. కేఎల్ రాహుల్ గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఇషాన్‌ను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

Also Read..

WTC ఫైనల్: నేడు లండన్‌‌ వెళ్లనున్న కెప్టెన్ రోహిత్

బౌలింగ్ ప్రాక్టీస్‌కు సిద్దమైన బుమ్రా..?



Next Story