'పతకాలు' గెలవకపోతే, జనాలు 'అథ్లెట్ల'ని మర్చిపోతారు.! నీరజ్ చోప్రా

by Geesa Chandu |   (  Updated:2024-08-10 15:51:56  IST  )

పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ 'వినేశ్ ఫొగాట్' గురించి.. ఒలింపిక్ రజత పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పతకాలు గెలవకపోతే, జనాలు అథ్లెట్లని మర్చిపోతారు.! నీరజ్ చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన భారత స్టార్ రెజ్లర్ 'వినేశ్ ఫొగాట్' గురించి.. ఒలింపిక్ రజత పతక విజేత, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సీఏఎస్ నిర్ణయం వినేశ్ ఫొగాట్ కు అనుకూలంగా వచ్చి, ఆమె రజత పతకం సాధిస్తే.. అది తప్పకుండా గొప్ప విషయమని, ఒకవేళ పతకాలు గెలవకపోతే మాత్రం కొంతకాలానికి ప్రజలు అథ్లెట్లను మర్చిపోతారని అన్నారు. అయితే వినేశ్ ఫొగాట్ కు పతకం వచ్చినా రాకున్నా.. వినేశ్ దేశం కోసం చేసిన కృషిని మాత్రం మరవొద్దని దేశ ప్రజలను కోరుతున్నట్లు" ఈ సందర్భంగా నీరజ్ చోప్రా అన్నారు.

Next Story