టీం ఇండియా గ్రేడ్ A+ ఆటగాళ్ల వార్షిక ఫీజు ఎంతో తెలుసా..?

by Disha Web Desk 12 |
టీం ఇండియా గ్రేడ్ A+ ఆటగాళ్ల వార్షిక ఫీజు ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ 2022-23 సీజన్‌కు సంబంధించి భారత ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. కాగా భారత ఆల్ రౌండర్ జడేజాను గ్రేడ్ A+ జాబితాలో చేర్చింది. దీంతో జడేజా.. ₹5 కోట్లకు బదులుగా ₹7 కోట్లు పొందుతారు. గ్రేడ్ A+లోని ఇతర క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు అలాగే గ్రేడ్ A (₹5 కోట్లు)లో ఐదుగురు ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అలాగే విరితో పాటుగా గ్రేడ్ B (₹3 కోట్లు) వార్షిక కాంట్రాక్ట్‌లలో ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.

ఇందులో చెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్ & శుభమాన్ గిల్ ఉన్నారు. ₹1-కోటి వార్షిక కాంట్రాక్టులు పొందిన ఆటగాళ్లలో ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్ మరియు KS భరత్ ఉన్నారు.


Next Story

Most Viewed