టీమిండియా స్టార్ క్రికెటర్‌ను మెసేజ్‌లతో బెదిరిస్తున్న మాజీ భార్య..

by Disha Web Desk 13 |
టీమిండియా స్టార్ క్రికెటర్‌ను మెసేజ్‌లతో బెదిరిస్తున్న మాజీ భార్య..
X

దిశ, వెబ్‌డెస్క్: తన పరువును భంగం కలిగించేలా విష ప్రచారం చేస్తుందని టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ అతని మాజీ భార్య అయేషా ముఖర్జీ పై న్యూఢిల్లీలోని పటియాలా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఆయేషా తన ఇమేజ్, కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరిస్తోందని ధవన్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆమెపై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. తన పరువు తీసేలా ఉన్నా మెసేజ్‌లను ఫార్వార్డ్‌ చేసిందని ధవన్‌ పేర్కొన్నాడు. స్నేహితులు, క్రికెట్‌‌కు సంబంధించిన వ్యక్తులు అలాగే ఐపీఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి అయేషా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుందని ఆధారాలతో కోర్టులో సమర్పించాడు. దీంతో ధవన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అయేషాను మందలించింది. ధవన్‌కు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అలాగే అతని పరువుకు భంగం కలిగేలా ఎలాంటి సమాచారాన్ని మీడియా తో కానీ సోషల్ మీడియాలో కానీ షేర్ చేయెద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.


Next Story

Most Viewed