- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా వర్సెస్ బంగ్లా సిరీస్ వాయిదా.. మళ్లీ ఎప్పుడు అంటే ?
రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ లను (Virat Kohli) గ్రౌండ్ లో చూడాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది.

దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ ( Rohit Sharma) అలాగే విరాట్ కోహ్లీ లను (Virat Kohli) గ్రౌండ్ లో చూడాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. టీమిండియా ( Team India) వర్సెస్ బంగ్లాదేశ్ ( Bangladesh) మధ్య వైట్ బాల్ సిరీస్ (white-ball series) వాయిదా పడింది. వాస్తవానికి ఈ సంవత్సరం ఆగస్టు మాసంలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వైట్ బాల్ సిరీస్ జరగాల్సి ఉండేది. కానీ ఆ సిరీస్ తాజాగా వాయిదా పడినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) అధికారికంగా ప్రకటించింది.
ఈ సిరీస్ ను మళ్లీ 2026 సెప్టెంబర్ మాసంలో... నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంటే సరిగ్గా మరో ఏడాది తర్వాత ఈ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని కూడా ప్రకటన విడుదలైంది. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య 3 వన్డేలు అలాగే మూడు టి20 సిరీస్ లు జరగాల్సి ఉంది. కానీ భద్రతా కారణాలవల్ల... ఈ సిరీస్ రద్దయినట్లు తెలుస్తోంది.
Twitter Link
🚨 BREAKING 🚨
— Sportskeeda (@Sportskeeda) July 5, 2025
BCCI confirms that the India vs Bangladesh white-ball series has been postponed to September 2026 from August 2025. 🏆#Cricket #India #ODI #T20I #BANvIND pic.twitter.com/WTNTnCjk8H






