మంత్రి ఎర్రబెల్లి కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

by  |
మంత్రి ఎర్రబెల్లి కోలుకోవాలని ప్రత్యేక పూజలు..
X

దిశ, తొర్రూరు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆదివారం పాటిమీద దేవాలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు. తొర్రూరు అభివృద్ధి కమిటీ ఛైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్ రావు మాట్లాడుతూ.. ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన మంత్రి దయన్నకు కరోనా పాజిటివ్ రావడం బాధకరమని అన్నారు.

దయాకర్ రావు త్వరగా కోలుకోని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed