కల్తీ కల్లుపై కొరడా

by  |
కల్తీ కల్లుపై కొరడా
X

దిశ, రంగారెడ్డి: ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న సమయంలో కల్తీ వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అక్రమాలకు అడ్డుచెప్పే అధికారులే అలుసు ఇవ్వడంతో యథేచ్ఛగా కల్తీ కల్లు అమ్మకాలు జరుపుతున్నారు. మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పోలీసులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. అధికారుల ప్రోత్సహంతోనే ఇదంతా జరుగుతుందన్న వాదనలు నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో దాడులు చేసిన స్పెషల్ ఆపరేషనల్ టీం(ఎస్‌ఓటీ) నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా క్లోరోఫామ్, చక్రీన్ తదితర రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed