నీవు లేక నేను లేనంటూ..

by  |
నీవు లేక నేను లేనంటూ..
X

దిశ, కూకట్​పల్లి : అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో మనస్థాపం చెందిన ఓ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పేట్​బషీరాబాద్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని జీడిమెట్ల దండమూడి ఎన్​క్లేవ్ రోడ్డులోని ఎన్‌సీఎల్​ సింధులో నివాసం ఉంటున్న ఐ.పినాకపాణి(56) తన తండ్రి ఐ.కృష్ణ మూర్తితో కలిసి నివాసముంటున్నాడు.

కొన్ని రోజుల కిందట అనారోగ్యం బారిన పడి తండ్రి కృష్ణమూర్తి మృతి చెందాడు. మృతుడి తల్లి జీడిమెట్ల లోని శ్వేత ఆర్యన్​ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న పినాకపాణి అన్న ఐ.వెంకట రమణ ఇంటికి వెళ్లింది. అయితే, తండ్రి మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన పినాకపాణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి కర్మ గురించి పినాకపాణితో మాట్లాడటానికి వెళ్లిన బంధువులు తలుపు తెరిచి చూడగా పినాకపాణి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం పేట్​ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Next Story

Most Viewed