‘పాకిస్తాన్ తీవ్రవాదులకే భయపడం.. మీరెంత’

by  |
‘పాకిస్తాన్ తీవ్రవాదులకే భయపడం.. మీరెంత’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పరులైన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తామని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారులు.. ఎమ్మెల్యేల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్ తీవ్రవాదులకే భయపడని బీజేపీ కార్యకర్తలు వైసీపీకి భయపడతారా అని ప్రశ్నించారు. కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏపీలో అభివృద్ధి జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ముందు చెత్త రాజకీయాలు చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదన్నారు. ఇసుక, మట్టి, ఎర్రచందనం వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటూ నిజాయితీగా ఉండే బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడతారా అని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed