‘బాధ్యతగా వ్యవహరించాలి’ 

by  |
‘బాధ్యతగా వ్యవహరించాలి’ 
X

దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని నారాయణపేట సీఐ చంద్రమోహన్ రావు తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆర్థికంగానే కాకుండా సామాజిక స్పృహతోనూ ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని హర్షించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఫర్టిలైజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట ప్రధాన చౌరస్తాలో వెహికల్ స్ప్రే ద్వారా సోడియం హైపో క్లోరైట్‌ను పిచికారీ చేయించారు. దీనికి సంబంధించిన పనులను సీఐ దగ్గరుండి పర్యవేక్షించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎదో ఒక రూపంలో తమ వంతు సాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Tags: sodium hypo clorite, spray, corona, virus, narayanapeta, CI chandra mohan, fertilizer association


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed