నెత్తురోడిన ఇరాక్.. ఆరుగురు మృతి

by  |
నెత్తురోడిన ఇరాక్.. ఆరుగురు మృతి
X

బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి రక్త మోడింది. గురువారం వరుసగా జరిగిన రెండు ఆత్మహుతి దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందగా, దాదాపు 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. బాగ్దాద్‌ నడిబొడ్డున గల వాణిజ్య సముదాయంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇద్దరు వ్యక్తులు ఆత్మహుతి దాడికి పాల్పడినట్లు ఇరాక్ జాతీయ మీడియా తెలిపింది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతోపాటు పెద్ద ఎత్తున ఆస్తినష్టం వాటిల్లినట్లు సమాచారం. బాగ్దాద్‌లోని రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాలపై బాంబు దాడులు జరగడం చాలా ఏండ్ల తర్వాత ఇదే ప్రథమం.

ఈ ఏడాది అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికల దృష్ట్యా తీవ్ర రాజకీయ అనిశ్చితుల నెలకొన్న నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ఇప్పటివరకు ప్రకటించుకోలేదు. గత కొన్ని నెలలుగా ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్, మిలిషియా గ్రూపులు బాంబు దాడులకు పాల్పడుతూ వస్తున్నాయి.



Next Story

Most Viewed