ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసిన సీపీ

by  |

దిశ, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు పోలీసులను సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. ఐవోసీఎస్, బీపీసీఎల్, కంపెనీల లోడుతో వెళ్తున్న ట్యాంకర్లను ఆపి డీజిల్‌ను దండుకుంటున్న ముఠాకు కానిస్టేబుళ్లు సహకరించారని రుజువుకావడంతో సీపీ వారిపై వేటు వేశారు. వీరిలో స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్బీ కానిస్టేబుల్ తో పాటు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. నిందితుల నుంచి రూ.13.87లక్షల నగదుతో పాటు, 20వేల లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరి కొంతమంది పోలీసుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం.


Next Story