సంకీర్త్‌కు సింగరేణి సీఎండీ… అభినందనలు

by  |
సంకీర్త్‌కు సింగరేణి సీఎండీ… అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్: కృషి ఉంటే మనుషులు రుషులువుతారు.. మహా పురుషులౌతారు అని పాట సామాన్యులను కూడా సింహాసనం ఎక్కేలా ఉత్తేజ పరుస్తోంది. అచ్చం ఈ పాటకు అద్దం పట్టేలా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి కార్మికుడు సంకీర్త్‌ తాను సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో 330 ర్యాంకు సాధించి నిరూపించాడు.

దీంతో ఆ యువకుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సివిల్‌ సర్వీసుకు ఎంపికైన సంకీర్త్‌కు అభినందనలు తెలిపారు.

అలాగే బెల్లంపల్లి ఏరియాలో ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అతని తండ్రి సిరిసెట్టి సత్యనారాయణకు కూడా అభినందనలు తెలిపారు. కాగా సింగరేణి యాజమాన్యం తనను తన కుమారున్ని అభినందించడంతో తండ్రి సత్యనారాయణ, సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన సంకీర్త్‌ తమ ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed