- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: మొక్కలు నాటుదాం- ప్రకృతిని కాపాడుకుందాం అని పిలుపునిస్తోంది ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతి హృదయాన్ని కదిలిస్తూ.. ఉధృతంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బాలీవుడ్ యంగ్ స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన తాజా సినిమా ‘యోధ’ షూటింగ్ స్పాట్లో.. సినిమా డైరెక్టర్లు సాగర్ అంబ్రే అండ్ పుష్కర్ ఓజాతో కలిసి ముంబైలోని వెస్ట్ చిత్రకూట్ స్టూడియోలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధార్థ్.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాల మనుగడ కోసం అభిమానులందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.