- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నేరేడుచర్ల : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఉద్యోగాలు రాక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన వారిని ఆమె పరామర్శిస్తున్నారు. బుధవారం ఉదయం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వెళ్లిన షర్మిల.. బంగారుగడ్డలో ఎండీ సలీం కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వెళ్లారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం అక్కడి నుంచి మండలంలోని మేడారం గ్రామానికి వెళ్లారు.అక్కడ ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నీలకంఠం సాయిని పరామర్శించాల్సి ఉంది. అయితే షర్మిల వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నా.. నీలకంఠం సాయి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీంతో షాక్ తిన్న షర్మిల.. తాళం వేసిన సాయి ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించింది. వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే షర్మిల వస్తుందనే టీఆర్ఎస్ నేతలు వారి కుటుంబాన్ని దాచిపెట్టారని షర్మిల అనుచరుడు పిట్ట రాంరెడ్డి ఆరోపించారు.