భార్య పైసలివ్వలేదని.. భర్త ఆత్మహత్య

by  |
భార్య పైసలివ్వలేదని.. భర్త ఆత్మహత్య
X

దిశ, పరకాల (శాయంపేట) : శాయంపేట మండలం పెద్దకొడపాకలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్లకాపరి అమ్మ సాంబయ్య (65) భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వృత్తిపరంగా గొర్లకాపరి అయిన సాంబయ్య తాగుడుకు బానిసై నిత్యం భార్యను, కుటుంబ సభ్యులను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భార్య సుగుణను తాగేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశాడు. తన దగ్గర డబ్బులు లేవని సువర్ణ చెప్పడంతో సాంబయ్య ఆమెతో గొడవకు దిగాడు.

అనంతరం మనస్తాపం చెందిన సాంబయ్య పత్తి చేను కొట్టడానికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సాంబయ్యను చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ విషయమై శాయంపేట పీఎస్ఐ రాజ్ కుమార్ వివరణ కోరగా సాంబయ్య మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.


Next Story

Most Viewed