అది హృదయాన్ని తాకేలా ఉంది: షర్మిల

by  |
అది హృదయాన్ని తాకేలా ఉంది: షర్మిల
X

దిశ, ఏపీ బ్యూరో : మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులంతా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత భాగస్వామి విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించిన నేపథ్యంలో వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ… ‘నాన్న జీవిత విశేషాలపై అమ్మ రాసిన పుస్తకమే “నాలో.. నాతో వైఎస్సార్‌‌”. ఇది చాలా మంచి పుస్తకం.. హృదయాన్ని తాకే విధంగా ఉంది’ అని అన్నారు.

‘నాన్నకు సంబంధించిన విశేషాలను ఈ పుస్తకంలో కొత్త కోణంలో తెలుసుకోవచ్చు. తనకు మాత్రమే తెలిసిన నాన్నలోని కోణాన్ని తెలుపుతూ అమ్మ ఈ పుస్తకం రాసింది. ఈ విధంగా నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది. ఈ పుస్తకం చదువుతున్నంత సేపు అమ్మ, నాన్నలతో కలిసి ప్రయాణం చేస్తున్నట్లు అనిపించింది. వారిద్దరితో ఎమోషనల్ జర్నీ చేస్తున్నట్లు అనిపించింది. నిజం చెప్పడం సులభం కాదు .. అయినప్పటికీ ధైర్యంగా అమ్మ నిజం చెప్పింది. ఈ పుస్తకంలో నాన్నకు సంబంధించిన అన్ని విషయాలను తెలిపింది. వైఎస్సార్ గొప్ప స్ఫూర్తిమంతమైన వ్యక్తి. ఆయనను జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది. అందుకే అమ్మ ఈ బుక్‌ రాసింది’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed