పండుగకు ముందురోజు నష్టాల్లో సూచీలు!

by  |
పండుగకు ముందురోజు నష్టాల్లో సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ముహూరత్ ట్రేడింగ్‌కి ముందు నష్టాలను నమోదు చేశాయి. బుధవారం ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు మిడ్-సెషన్ తర్వాత బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాల బాట పట్టాయి. గత రెండు వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు తోడవడంతో దేశీయ రంగాల షేర్లు కొంత పుంజుకోగానే మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధమవుతున్నారు.

లాభాలు పెరుగుతున్న కొద్దీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగడం వల్లే నష్టాలు ఏర్పడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బుధవారం నాటి ట్రేడింగ్‌లో సైతం ఇదే ధోరణి కనిపించిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 242.65 పాయింట్లు కోల్పోయి 59,786 వద్ద, నిఫ్టీ 59.75 పాయింట్లు నష్టపోయి 17,829 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్, రియల్టీ మినహా అన్ని రంగాలు డీలాపడ్డాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, డా రెడ్డీస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, సన్‌ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టైటాన్, పవర్‌గ్రిడ్, ఐటీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.46 వద్ద ఉంది.


Next Story

Most Viewed