ఆమెపై జరిగింది గ్యాంగ్ రేపే..

by  |
ఆమెపై జరిగింది గ్యాంగ్ రేపే..
X

దిశ, వెబ్‌డెస్క్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో 28 ఏళ్ల మహిళపై కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మహిళను మాయమాటలతో నమ్మించి, కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం మహిళను దారుణంగా హింసించి, హత్య చేసినట్టు వెల్లడించారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితులైన మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురిని ఇప్పటికే రామచంద్రాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.


Next Story