నేటి నుంచి రెండో విడత పంచాయతీ నామినేషన్లు

by  |
నేటి నుంచి రెండో విడత పంచాయతీ నామినేషన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. రెండో విడతలో భాగంగా 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు గాను రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి రెండో దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 5వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా.. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ జరగనుంది.



Next Story