సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు ఓపెన్ : సీఎం జగన్‌

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్నారు.ఈ విషయమై మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆగష్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు. అదేవిధంగా ఆగస్టు 15న [&hellip;]</p>

సెప్టెంబర్‌ 5 నుంచి స్కూళ్లు ఓపెన్ : సీఎం జగన్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబరు 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్నారు.ఈ విషయమై మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఆగష్టు 31వ తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు. అదేవిధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.

Next Story