- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, తెలంగాణ బ్యూరో: సర్కార్ సిరంజీలు బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ వేసేందుకు సూదుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో సిరంజీలు తెచ్చుకుంటేనే వ్యాక్సిన్ అందిస్తామని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. తమకు సిరంజీల కొరత ఉందని, టీకా పొందాలంటే స్వతహాగా సూదులు తెచ్చుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో సిరంజీలు తెచ్చుకోవడమేమిటని ప్రశ్నించిన వారికి డోసులు ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి సూదులు, సిరంజీలు కొనుగోలు చేసుకొని తీసుకువెళ్లాల్సి వస్తుంది.
పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండటం విస్తుపోయే అంశం. ఇటీవల కాలంలో 104 ఫిర్యాదుల కాల్ సెంటర్ కు ఇలాంటి కంప్లైట్స్ కూడా వస్తున్నట్లు వైద్యారోగ్యశాఖలోని ఓ అధికారి ఆఫ్ ది రికార్డులో తెలిపారు. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారం పీహెచ్సీలో ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటన జరిగింది. సూదులు తెచ్చుకున్న వారికే డోసులు ఇచ్చారు.
ఎటు పోతున్నాయ్.?
రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా సర్కార్ కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిలో కొన్ని కేంద్రాల్లో టీకాలు పొందాలంటే స్వతహాగా సిరంజీలు కొనుక్కోని వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితి అధికంగా ఉంది. వాస్తవంగా ప్రతీరోజు వైద్యారోగ్యశాఖ కోల్డ్ స్టోరేజ్ల నుంచి ఒక్కో పీహెచ్సీకు 200 డోసులతో పాటు సిరంజీలను టీఎస్ఎంఎస్ఐడీసీ(తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్టక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్) సప్లై చేస్తుంది. అర్హులు ఎక్కువున్న చోట 500 నుంచి 800 డోసులను కూడా ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వీటికి అనుసంధానంగా సిరంజీలూ పంపిణీ చేస్తున్నారు. ప్రతీ వారం స్టాక్ కూడా పరిశీలిస్తున్నట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ పేర్కొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలతో పాటు సిరంజీలనూ పూర్తిస్థాయిలో నిల్వ ఉంచామని స్పష్టం చేసింది. అయితే ఆయా కేంద్రాల్లో సిరంజీల కొరత ఎందుకు వస్తుందనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెడికల్ ఆఫీసర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది కలసి అమ్ముకుంటున్నారేమోనని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు.