ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

by  |
ఏపీలో కేసీఆర్ పార్టీ పెట్టుకోవచ్చు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు ఏపీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్‌కు లెక్కలేనన్ని విజ్ఞాపనలు వస్తే ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చని సలహా ఇచ్చారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ…ప్రజలు అడిగినా పార్టీ పెట్టొచ్చు.. అడక్కపోయినా పెట్టుకోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉందన్నారు.

ఈ సందర్భంగా.. విభజనతో తెలంగాణ అంధకారం అవుతుందని ఏనాడూ వైసీపీ అనలేదని చెప్పుకొచ్చారు. విడిపోతే ఆంధ్రా అంధకారం అవుతుందని ఆనాడు వైసీపీ చెప్పిందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఇకపోతే ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఏపీలో పార్టీ పెట్టాలని విజ్ఞాపనలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే.


Next Story