సైఫ్ అలీ, కరీనా కపూర్ లపై ఘోరమైన ట్రోల్స్.. అసలేం జరిగిందంటే ?

by  |
ali-khan
X

దిశ, సినిమా : సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. గతంలో తమ ఇద్దరు కొడుకులు తైమూర్, జెహ్ పేర్ల విషయంలో దారుణంగా విమర్శల పాలైన సంగతి తెలిసిందే. కాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన సైఫ్.. ఈ ప్రపంచం అందరికీ ఈక్వల్ ప్లేస్ కాదని, ప్రజలందరూ ఒకేవిధంగా సంతోషంగా ఉండలేరని అన్నాడు. తాము విశేషమైన, మంచి వ్యక్తులు అనుకుంటున్నామన్న ఆయన.. ట్యాక్స్ చెల్లిస్తూ లీగల్ పీపుల్‌గా బతుకుతున్నామని తెలిపాడు.

ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు కష్టపడతామని, ఈ ప్రపంచానికి అనుకూలమైన మొత్తాన్ని అందిస్తామన్న స్టార్ హీరో.. నెగెటివ్ పీపుల్‌ గురించి మాట్లాడటం విలువైంది కాదన్నాడు. అలాంటి వారిని పట్టించుకోవడం టైమ్ వేస్ట్ అని అభిప్రాయపడ్డాడు. అయినా ఇలాంటి నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్ తమనేమీ చేయలేవన్నాడు సైఫ్.


Next Story

Most Viewed