పవర్ స్టార్‌తో మలార్ బ్యూటీ జతకట్టేనా?

by  |
పవర్ స్టార్‌తో మలార్ బ్యూటీ జతకట్టేనా?
X

దిశ, వెబ్ డెస్క్: మలార్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. కేవలం కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ దూసుకుపోతున్న భామ.. ఇప్పటికే ‘లవ్ స్టోరి’ సినిమా కంప్లీట్ చేసి హిట్ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం రానా దగ్గుబాటితో “విరాటపర్వం”, నానితో “శ్యామ్ సింగ రాయ్” చిత్రాలు చేస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించనుందని వార్తలు వచ్చాయి. “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో పవన్ కు భార్యగా కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కాంబినేషన్ కుదిరేలా లేదని సమాచారం.

“విరాటపర్వం”, “శ్యామ్ సింగ రాయ్” చిత్రాలతో బిజీగా ఉన్న సాయి పల్లవికి డేట్స్ సర్దుబాటు కాలేదని ఫిల్మ్ నగర్ సమాచారం. దీంతో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం లేదని తెలుస్తుండగా.. ఈ క్యారెక్టర్ కు తను మాత్రమే న్యాయం చేయగలదని భావిస్తున్న మేకర్స్ తన కోసం వెయిట్ చేస్తారేమో చూడాలి. ఈ క్రేజీ కాంబినేషన్ ను తెరపై చూడాలనుకుంటున్న ఫ్యాన్స్.. రౌడీ బేబీ అయినా డేట్స్ సర్దుబాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మలార్ బ్యూటీనే ఆ క్యారెక్టర్ ప్లే చేస్తుందా? లేక మరో బ్యూటీ రీప్లేస్ చేస్తుందా? అనే విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా.. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపుదిద్దకుంటున్న సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.



Next Story