సౌతాఫ్రికా క్రికెటర్లు సేఫ్ !

by  |
సౌతాఫ్రికా క్రికెటర్లు సేఫ్ !
X

టీమ్ ఇండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు మార్చి తొలి వారంలో ఇండియాకు వచ్చిన సౌతాఫ్రికా ఆటగాళ్లు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆ టీమ్ ముఖ్య ఆరోగ్య అధికారి షుయబ్ మంజ్రా తెలిపారు. దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాకు వచ్చిన తర్వాత ధర్మశాల మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. అదే సమయంలో కరోనా ప్రభావం తీవ్రం కావడంతో బీసీసీఐ ఆ సిరీస్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత వెంటనే వాళ్లను కోల్‌కతా తరలించారు. అయితే, అంతర్జాతీయ విమానాల కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్ అవడంతో వారం రోజులు అక్కడే ఉండి మార్చి 18న తిరిగి దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు. కాగా, దక్షిణాఫ్రికాలో 14 రోజుల ఐసొలేషన్ తర్వాత వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారణ అయింది.

Tags: South Africa, Cricketers, Isolation, Corona Negative

Next Story

Most Viewed