560 చిన్నారులకు అండగా నిలిచిన సచిన్..!

by  |
560 చిన్నారులకు అండగా నిలిచిన సచిన్..!
X

దిశ, వెబ్‎డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించుకున్న సచిన్.. నిజజీవితంలో కూడా దేవుడని నిరూపించుకున్నాడు. తాజాగా పోషకాహార లోపం, నిర్లక్యరాస్యతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు వచ్చాడు. ఎన్జీవో సంస్థ అయిన పరివార్‎తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 చిన్నారులకు అండగా నిలిచాడు. మధ్యప్రదేశ్‎లోని సెహోర్ జల్లాలోని సెవానియా, బీల్‎పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్‎లోని గిరిజన చిన్నారులకు టెండూల్కర్ ఫౌండేషన్ పోషకాహారం, విద్యను అందించనుంది. అట్టడుగు వర్గాలకు చెందిన చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read Also…

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్



Next Story

Most Viewed