‘విజయ’పాల సేకరణ ధర రూపాయి పెంపు

by  |
‘విజయ’పాల సేకరణ ధర రూపాయి పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (విజయ డెయిరీ) పాల సేకరణ ధరను పెంచుతున్నట్టు సమాఖ్య చైర్మన్ ​లోకా భూమారెడ్డి ప్రకటించారు. మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రతి లీటరు‌పై రూపాయి పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ధర పెంచినట్టు తెలిపారు. ఇప్పటికే లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పెంచిన రూపాయి అందుకు అదనమని తెలిపారు. విజయ డెయిరీ నుంచి పాల బిల్లుల రూపంలో రైతులకు ఏటా రూ.12 కోట్లు చెల్లిస్తున్నట్టు వెల్లడించారు.


Next Story

Most Viewed