ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం

by  |
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం
X

దిశ, వెబ్‎‎డెస్క్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జరిగింది. పిలిబిత్ జిల్లాలోని పురాన్‌పూర్ ప్రాంతంలో శనివారం తెల్ల‌వారుజామున బ‌స్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలింంచారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్లో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉందని పిలిబిత్ ఎస్పీ జైప్ర‌కాశ్ తెలిపారు.

Next Story