- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోటూరు వద్ద టిప్పర్ను సుమో, కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఓ సుమో వేగంగా వెళ్లి టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెండు కార్లు, టిప్పర్ దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనం అయ్యారు. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story