గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం

by  |
గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‎డెస్క్:
కృష్ణా జిల్లా గన్నవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్‎ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‎లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జార్ఖండ్‎కు చెందిన భాస్కరపట్ల శ్రీనివాసశాస్త్రి, రవిశంకర్ శాస్త్రిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed