- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియక తల పట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారత్తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికరంగా మారాయి. విదేశీ వీసాల రద్దు లాంటి నిర్ణయాలపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో లీడర్, మిర్చి, మిరపకాయ్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ కూడా ట్రంప్ను చెడామడా కడిగేసింది. ట్రంప్ రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించిన ఆమె.. ట్రంప్ ఒక ఇడియట్ అని, భయంకర మానవుడు అని విమర్శించింది. ట్రంప్ ఫాలోవర్స్ను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపిన రిచా.. అమెరికాలో సెటిలై ఎందుకీ ఏడుపు? అన్న ఓ నెటిజన్కు గట్టిగానే సమాధానం ఇచ్చింది. 22 ఏళ్లుగా అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నానని.. ఇక్కడే ఉంటానని చెప్పింది. భారతీయులు కలలుగన్న భవిష్యత్తు కోసం ట్రంప్కు వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేసింది.