- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా వ్యాధి నివారణ చికిత్సలో ఉపయోగించే రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ను బ్లాక్లో అత్యధిక ధరకు విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ మెడిసిన్ ‘వైల్’ మెడికల్ షాపుల్లో రూ. 5,400లకు లభిస్తుండగా.. వీరు రూ. 30వేలకు పైగా అమ్ముతున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముంబై పట్టణంలో రెండు చోట్ల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జరిపిన దాడుల్లో ఈ మెడిసిన్ నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. మఫ్టీలో ఇద్దరు పోలీసులను పంపి.. ఈ డ్రగ్ అమ్మకం గుట్టు రట్టు చేశారు. అలాగే, ఈ మందును తయారు చేస్తున్న డెల్ఫా ఫార్మస్యూటికల్స్ అనే సంస్థకు చెందిన అయిదుగురిని, మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఎవరైనా బయట బ్లాక్లో కరోనా మెడిసిన్ విక్రయిస్తే వారి గురించి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.