కడప జైలుకు స్మగ్లర్ బాషా భాయ్ గ్యాంగ్..!

by  |
కడప జైలుకు స్మగ్లర్ బాషా భాయ్ గ్యాంగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్‌తో పాటు, ఐదుగురు తమిళ కూలీలు సజీవదహనం అవ్వడానికి కారణమైన బాషా భాయ్, అతని గ్యాంగ్‌ను పోలీసులు కడప జైలుకు తరలించారు. ఇటీవల ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళ కూలీల వాహనాన్ని బాషా బాయ్ ఆదేశాల మేరకు లోకల్ గ్యాంగ్ ఛేజ్ చేసింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొని ప్రమాదవశాత్తు ఐదుగురు సజీవ దహనం అయ్యారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జిల్లా పోలీసులు తొలుత ముగ్గురు నిందితులతో పాటు బాషాను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం ఇవాళ కోయంబత్తూరులో తలదాచుకుంటున్న అతని గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. అయితే, స్మగ్లర్ బాషాకు కోయంబత్తూరుతో పాటు, బెంగళూరులో రెండు ఎర్రచందనం గోడౌన్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో బాషాను ప్రశ్నిస్తున్నారు. రెండ్రోజుల్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడుతామని పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed