బిగ్ బ్రేకింగ్ : రికార్డు బ్రేక్.. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ధర ఎంతంటే..

by  |
బిగ్ బ్రేకింగ్ : రికార్డు బ్రేక్.. బాలాపూర్ గణేష్ లడ్డు వేలం ధర ఎంతంటే..
X

దిశ, జల్​పల్లి : బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డు వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం బొడ్డురాయి వేదికయ్యింది. ఎంతో ఉత్కంఠగా రెండేళ్లుగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాట వేలాది మంది భక్త జనసందోహం నడుమ 25 మంది పోటీదారుల మధ్య ఎంతో ఉత్కంఠగా జరిగింది. రూ.1016 తో ప్రారంభమై హోరాహోరీగా సాగిన వేలం పాట పోరులో 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి లడ్డును సొంతం చేసుకున్నారు.

తాజాగా 27వ సారి బాలాపూర్ గణేష్ లడ్డును వేలం పాటలో దక్కించుకున్న జాబితాలో మర్రి శశాంక్ రెడ్డి చేరిపోయారు. 41 వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా గత 26 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ట గుర్తింపు ఉంది.

కరోనా కారణంగా గత సంవత్సరం బాలాపూర్​గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు. 2019లో జరిగిన వేలం పాట కంటే ఈసారి.. 1.30 లక్షలు అధిక ధర పలికింది. 2019లో కొలను రాం రెడ్డి 17లక్షల 60 వేల రూపాయలకు సొంతం చేసుకున్న విషయం విదితమే.



Next Story