ఎమ్మెల్సీ ఎన్నికలు: భైంసాలో రికార్డు స్థాయి పోలింగ్

by  |
ఎమ్మెల్సీ ఎన్నికలు: భైంసాలో రికార్డు స్థాయి పోలింగ్
X

దిశ, ముధోల్: భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 102 ఉండగా.. సాయంత్రం 4 గంటల వరకు 101 ఓట్లు నమోదయ్యాయి. దీంట్లో 41 మంది పురుషులు, 58 మంది మహిళలు తమ ఓటును వినియోగించుకున్నారు. దీంతో దాదాపు 99 శాతం పోలింగ్ నమోదయింది. ఈ పోలింగ్‌లో 100 ఓట్లు స్థానికమైనవి కాగా, ఇద్దరు కౌన్సిలర్స్ పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన తమ ఓటు వినియోగించుకున్నారు.



Next Story

Most Viewed