ప్రధాని మోడీకి లేఖరాసిన రాహుల్ గాంధీ

by  |
ప్రధాని మోడీకి లేఖరాసిన రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనావిలయతాడవం చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా గురించి ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. సెకండ్ వేవ్ సునామీతో దేశం విలవిలలాడుతోందన్నారు. అలానే కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలిగించాలని రాహుల్ గాంధీ లేఖలో మోదీని కోరారు. వైరస్ మ్యుటేషన్‌పై జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేయాలన్నారు. కొత్త మ్యుటేషన్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలని తెలిపారు. ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే దేశం సంక్షోభంలోకి వెళ్తుందని, ప్రజలందరికీ వేగంగా వ్యాక్సిన్ వేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed